News December 6, 2024
జగన్ పాలన.. దళితులకు నరకయాతన: లోకేశ్

AP: గత టీడీపీ హయాం(2014-19)తో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ జమానాలో దళితులపై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది’ అంటూ ఆయన Xలో పోస్ట్ చేశారు.
Similar News
News October 23, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ ఫస్ట్ లుక్ రివీల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ రివీలైంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ టైటిల్ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో బియర్డ్ లేకుండా ప్రభాస్ పవర్ఫుల్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ అనే ట్యాగ్లైన్ ఇచ్చారు. అలాగే ఓ సంస్కృత శ్లోకాన్ని మేకర్స్ ట్వీట్లో రాసుకొచ్చారు.
News October 23, 2025
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

AP: రైతుల నుంచి కనీస మద్దతు ధరకు CCI ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పత్తి రైతులు తప్పనిసరిగా ఈ-క్రాప్లో నమోదై, సీఎం యాప్ ద్వారా లాగిన్ అయి, ఆధార్ అనుసంధానంతో కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకోవాలి. కపాస్ యాప్ స్లాట్ బుకింగ్ ప్రకారం పత్తిని CCI కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. రైతులకు సందేహాలుంటే 7659954529కు కాల్ చేయొచ్చు.
News October 23, 2025
‘కపాస్ కిసాన్ యాప్’లో నమోదు ఎలా?

యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.