News December 6, 2024

దేశంలో రక్తహీనత కేసులు ఎక్కువయ్యాయి: ఎంపీ రఘురాం రెడ్డి

image

దేశంలో మహిళలు, గర్భిణులు, బాలింతలు, పిల్లలపై రక్తహీనత తీవ్ర ప్రభావం చూపుతోందని, ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇది తెలియదా..? అని లోక్ సభలో ప్రశ్నించారు. దీని నివారణకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో వచ్చిన మార్పు వివరాలు ఏమిటని అడిగారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నలో కోరారు.

Similar News

News March 28, 2026

ఖమ్మం: ఈ ఒక్క రోజే అవకాశం!

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.

News March 27, 2026

ఖమ్మం జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

image

జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ నిర్వహణే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. దీనిలో భాగంగా ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్‌కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.

News March 26, 2026

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనుదీప్‌

image

తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా గృహాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో మంజూరైన 802 ఇళ్లలో ప్రస్తుతం 736 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.