News December 7, 2024

ఈ నెల 10 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు: తూ.గో కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నుంచి ఆమె శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.  గ్రామాలలో భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Similar News

News January 25, 2026

విశాఖ ఉత్సవంలో హెలీకాప్టర్ రైడ్

image

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు హెలీకాప్టర్ రైడ్‌ మంచి అనుభూతిని అందింస్తుంది. ఈ హెలీకాప్టర్‌‌ను మంత్రి కందుల దుర్గేష్ శనివారం ప్రారంభించారు. ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, MLA శ్రీనివాసరావు, APTDC ఛైర్మన్ బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు, ఆకాశ మార్గం నుంచి హెలికాప్టర్ రైడ్‌లో వీక్షించారు.

News January 25, 2026

తూ.గో: నేడు ఆనం కేంద్రంలో ఓటరు దినోత్సవ వేడుకలు

image

జాతీయ ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నేడు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమం వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఓటరు అవగాహన కార్యక్రమాలు, కొత్తగా నమోదు అయిన ఓటర్లకు అభినందనలు, ప్రజాస్వామ్య విలువలపై సందేశాలు ఇస్తారని వెల్లడించారు.

News January 24, 2026

తూ.గో: 17 మంది నేరస్తులపై PIT NDPS యాక్ట్

image

తూ.గోలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. దీనిలో భాగంగా గంజాయి అలవాటు పడిన 17 మంది నేరస్తులపై PIT NDPS ACT అమలుకు అనుమతులు రాగా 14 మందిని జైలుకు పంపించామన్నారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాలు, ఐసోలేషన్ ప్రదేశాలు ఇతర ప్రాంతాలలో డ్రోన్ నిఘా ఏర్పటు చేశామన్నారు.