News December 7, 2024
పోలవరం గడువు మార్పుపై సీఈవో అభ్యంతరం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733537001325_695-normal-WIFI.webp)
AP: పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినందునే డెడ్లైన్ను ప్రకటించామని పీపీఏ సీఈవో అతుల్ జైన్ తెలిపారు. ఇప్పుడు 2027 డిసెంబర్కు పనులు పూర్తిచేస్తామని చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 2న డయాఫ్రం వాల్ పనులు మొదలు పెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,300 కోట్లలో 75% నిధులు ఖర్చు పెడితేనే తదుపరి వాయిదా చెల్లిస్తామన్నారు.
Similar News
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్కు శూన్య హస్తమేనా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738771166983_782-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్మీట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_102024/1728572175272_367-normal-WIFI.webp)
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్లో ఉంటుందని కూటమి సర్కార్ను ఆయన హెచ్చరించారు.
News February 5, 2025
పీవోకేలో అడుగుపెట్టిన హమాస్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738764863506_1032-normal-WIFI.webp)
కశ్మీర్ సాలిడారిటీ డేలో పాల్గొనేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్కు హమాస్ లీడర్ ఖలీద్ అల్ ఖదౌమీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్లో జైషే (Jaish-e – జైషే) మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తల్హా సైఫ్తో కలిసి ఖలీద్ పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. భద్రతా చర్యలు తీవ్రతరం చేయాలని ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.