News December 7, 2024
బీసీసీఐ సరైన పని చేసింది: యూసుఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపించకుండా బీసీసీఐ సరైన పని చేసిందని మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘బీసీసీఐ ఎప్పుడూ భారత ఆటగాళ్ల భద్రత గురించే ముందు ఆలోచిస్తుంది. ఆదాయం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంది’ అని కొనియాడారు. వచ్చే ఏడాది పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా.. ఆ దేశంలో తమ మ్యాచుల్ని ఆడేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
Similar News
News February 5, 2025
రాహుల్.. ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోండి: కేటీఆర్
TG: నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదని, బీసీ డిక్లరేషన్ పేరుతో సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పిందనే విషయాలు ప్రజలకు అర్థమయ్యాయని KTR ట్వీట్ చేశారు. కులగణన నివేదికతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైందని తెలిపారు. గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లు రాజకీయాల కోసమేనని అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలన్నారు.
News February 5, 2025
రోహిత్ శర్మ రిటైర్మెంట్?
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
News February 5, 2025
WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు
సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.