News December 7, 2024
వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసు.. అజిత్ పవార్కు ఊరట

MH Dy.CM అజిత్ పవార్కు ఊరట లభించింది. ₹వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసులో IT ట్రిబ్యునల్ క్లీన్చిట్ ఇచ్చింది. MH సహకార బ్యాంకు స్కాం కేసులో జరందేశ్వర్ షుగర్ మిల్లును సీజ్ చేశారు. బ్యాంకులో బోర్డు సభ్యుడిగా అజిత్ ఉండగా మిల్లును తక్కువ ధరకే వేలం వేశారని, వేలంలో మిల్లు కొన్న సంస్థ నుంచి దాన్ని అజిత్ కుటుంబం దక్కించుకుందని ఆరోపణలున్నాయి. నిధుల మళ్లింపు ఆధారాలు లేవని ట్రిబ్యునల్ తేల్చింది.
Similar News
News October 28, 2025
వైద్య చిహ్నం వెనుక అసలు కథ!

వైద్య రంగానికి వాడే చిహ్నం వెనుక ఉన్న చరిత్ర గురించి మీకు తెలుసా? ఈ చిహ్నాన్ని ‘రాడ్ ఆఫ్ అస్క్లెపియస్’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పాము చుట్టుకొని ఉన్న ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు అస్క్లెపియస్కు ప్రతీకగా భావిస్తారు. పాము చర్మం విడిచే విధానం పునర్జన్మ, ఆరోగ్యం & నయం కావడాన్ని సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ కూడా ఇదే ఉండటం విశేషం.
News October 28, 2025
నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్పై జైశంకర్ పరోక్ష విమర్శలు

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.
News October 27, 2025
కవిత కొత్తగా..

TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త వేషధారణలో కనిపిస్తున్నారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన ఆమె గతంతో పోలిస్తే సాదాసీదా చీరలు ధరిస్తున్నారు. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ప్రస్తుతం కవిత నిజామాబాద్ జిల్లాలో రైతులను పరామర్శిస్తున్నారు. 4 నెలల పాటు ఈ యాత్ర సాగనుంది.


