News December 7, 2024
వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసు.. అజిత్ పవార్కు ఊరట

MH Dy.CM అజిత్ పవార్కు ఊరట లభించింది. ₹వెయ్యి కోట్ల బినామీ ఆస్తుల కేసులో IT ట్రిబ్యునల్ క్లీన్చిట్ ఇచ్చింది. MH సహకార బ్యాంకు స్కాం కేసులో జరందేశ్వర్ షుగర్ మిల్లును సీజ్ చేశారు. బ్యాంకులో బోర్డు సభ్యుడిగా అజిత్ ఉండగా మిల్లును తక్కువ ధరకే వేలం వేశారని, వేలంలో మిల్లు కొన్న సంస్థ నుంచి దాన్ని అజిత్ కుటుంబం దక్కించుకుందని ఆరోపణలున్నాయి. నిధుల మళ్లింపు ఆధారాలు లేవని ట్రిబ్యునల్ తేల్చింది.
Similar News
News January 26, 2026
రాజమండ్రి: సమానత్వానికి ఆమె జీవితమే నిదర్శనం

రాజమండ్రికి చెందిన దువ్వూరి సుబ్బమ్మ బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరించి జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా నిలిచారు. ఆమె లాంటి వారి ధైర్యం వల్లే నేడు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను మహిళలు అనుభవిస్తున్నారు. గణతంత్ర ఉత్సవాల వేళ పౌర హక్కుల కోసం పోరాడిన దువ్వూరి లాంటి వారి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం అనే రాజ్యాంగ సూత్రానికి ఆమె జీవితమే ఒక నిదర్శనం.
News January 26, 2026
రాజమండ్రి: సమానత్వానికి ఆమె జీవితమే నిదర్శనం

రాజమండ్రికి చెందిన దువ్వూరి సుబ్బమ్మ బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరించి జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా నిలిచారు. ఆమె లాంటి వారి ధైర్యం వల్లే నేడు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను మహిళలు అనుభవిస్తున్నారు. గణతంత్ర ఉత్సవాల వేళ పౌర హక్కుల కోసం పోరాడిన దువ్వూరి లాంటి వారి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం అనే రాజ్యాంగ సూత్రానికి ఆమె జీవితమే ఒక నిదర్శనం.
News January 26, 2026
నేటి ముఖ్యాంశాలు

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగరేణిలో మిగిలిన స్కామ్లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్పై మూడో T20Iలో భారత్ విజయం


