News December 8, 2024
క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లు జరగొద్దు: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733570679522_18054828-normal-WIFI.webp)
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో MROలు, MPDOలు, MPOలు, మునిసిపల్ కమిషనర్ లకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, అధికారులకు అవగాహన కల్పించారు. రొటీన్ కార్యక్రమంలా భావన వద్దని, ఒక పేదవారికి శాశ్వత ఇంటి హక్కు ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News December 27, 2024
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి: తమ్మినేని
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735217505440_18054828-normal-WIFI.webp)
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆశ వర్కర్లు చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మంకు చేరుకున్న నేపథ్యంలో వారికి తమ్మినేని సంఘీభావం తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
News December 26, 2024
సీఎం కప్-2024 రాష్ట్రస్థాయి పోటీలకు సర్వం సిద్ధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735202033705_18054828-normal-WIFI.webp)
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పోటీలు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలు పూర్తిచేసుకుని, డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. కాగా ఖమ్మం జిల్లా నుంచి 24 క్రీడాంశాల్లో 422 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొంది, పోటీల్లో పాల్గొననున్నారు.
News December 26, 2024
కన్నుల పండుగగా రాములోరి నిత్య కళ్యాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735201393436_18054828-normal-WIFI.webp)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.