News December 8, 2024
17న మంగళగిరి ఎయిమ్స్కు రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారు. దీంతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా శీతాకాల విడిదిలో భాగంగా ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు.
Similar News
News July 5, 2025
10,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని EU డిమాండ్

APSRTCలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు వెంటనే 11వ PRC బకాయిలు, పెండింగ్ DAలు చెల్లించాలని కోరింది. మరణించిన, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్లు తక్షణం చెల్లించాలని నిన్న విజయవాడలో నిర్వహించిన ధర్నాలో కోరింది. అటు కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను RTCకే అప్పగించాలని EU స్పష్టం చేసింది.
News July 5, 2025
WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.
News July 5, 2025
ఇన్స్టాలో అమ్మాయి, అబ్బాయి ముద్దు వీడియో వైరల్.. తర్వాత..

TG: సోషల్ మీడియాను మిస్ యూస్ చేస్తే అనర్థాలకు దారి తీస్తుందనడానికి ఈ ఘటనో ఉదాహరణ. వరంగల్లోని కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసుకొని దాన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరలై ఇరు కుటుంబాల వాళ్లు చూశారు. దీంతో 2 వర్గాలు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.