News December 8, 2024

మహాయుద్ధం గురించి ముందే ఆమె హెచ్చరిక?

image

సిరియాలో ప్రభుత్వం కూలిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాబా వంగా అనే జ్యోతిషురాలు చెప్పిన జోస్యం గురించి చర్చ నడుస్తోంది. ‘సిరియా ప్రభుత్వం పడిపోయినప్పుడు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య ఓ యుద్ధం మొదలవుతుంది. అది 3వ ప్రపంచయుద్ధానికి దారి తీస్తుంది. చివరికి పశ్చిమ దేశాలు నాశనమవుతాయి’ అని పేర్కొన్నారు. 1996లో బాబా వంగా చనిపోయారు. అయితే, ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు గతంలో నిజమయ్యాయి.

Similar News

News February 5, 2025

UCC: మొదటి ‘సహ జీవనం’ జోడీ నమోదు

image

ఉత్తరాఖండ్‌లో UCC అమల్లోకి వచ్చిన 9 రోజుల తర్వాత సహజీవనం చేస్తున్న మొదటి జోడీ తమ బంధాన్ని రిజిస్టర్ చేసుకుంది. మరో రెండు జంటల అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. నిబంధనల ప్రకారం UCC అమల్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ‘లివిన్ కపుల్స్’ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే 6 నెలల వరకు జైలుశిక్ష, రూ.25వేల ఫైన్ లేదా ఆ రెండూ విధించొచ్చు. ఇక మంగళవారం నాటికి 359 పెళ్లిళ్లు నమోదయ్యాయి.

News February 5, 2025

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సా.6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.

News February 5, 2025

తండ్రి అయ్యేందుకు 11వేల కి.మీలు ప్రయాణం

image

దక్షిణ చిలీలోని ‘పార్క్ టంటాకో’ అటవీ ప్రాంతాల్లో ఉండే డార్విన్స్ కప్పలకు ప్రాణాంతక కైట్రిడ్ ఫంగస్ సోకినట్లు 2023లో గుర్తించారు. దీంతో ఈ జాతి అంతరించిపోకుండా ఉండేందుకు చేపట్టిన ఎమర్జెన్సీ మిషన్‌లో మగ కప్పలను యూకేకు తరలించారు. దీనికోసం బోటు, విమానం, కారులో ఇలా 11వేల కి.మీలకు పైగా ప్రయాణించాయి. ఎట్టకేలకు ఈ అసాధారణ విధానం ద్వారా యూకేలో 33 పిల్లలు జన్మనిచ్చాయి. ఇవి 2గ్రాముల కంటే తక్కువ బరువుంటాయి.

error: Content is protected !!