News December 9, 2024
జెత్వానీ కేసు.. విద్యాసాగర్కు బెయిల్

AP: సినీ నటి జెత్వానీ కేసులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటిని వేధించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు సెప్టెంబర్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయొచ్చని నటి తరఫు లాయర్లు వాదించగా కోర్టు తోసిపుచ్చింది.
Similar News
News March 18, 2026
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPTYలో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
News March 18, 2026
కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP: అభివృద్ధి పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50వేల మందికి ₹2,000Cr చెల్లించనుంది. ఉగాది నాటికి కొన్ని బిల్లులు చెల్లించాలని CM సూచించడంతో ఆ మేరకు విడుదల చేసింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, SDRF-SDMF వంటి హెడ్స్ కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోంది. ఈ లిస్టులో ₹కోటిలోపు పనులు చేపట్టినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.


