News December 10, 2024
దేశవ్యతిరేక శక్తులపై కలిసి పోరాడాలి: కిరణ్ రిజిజు

పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ తమాషాలు మానుకొని రాహుల్ని ప్రజలు ఎందుకు నమ్మట్లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్కు హితవు పలికారు. అటు, సోనియా, <<13836410>>జార్జ్ సోరోస్<<>> మధ్య ఆర్థిక బంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కొన్నింటిని రాజకీయ కోణంలో చూడలేమని, దీన్ని కాంగ్రెస్, రాహుల్కి సంబంధించిన విషయంగా చూడట్లేదన్నారు. దేశ వ్యతిరేక శక్తులపై కలిసికట్టుగా పోరాడాలన్నారు.
Similar News
News September 23, 2025
వేణుగోపాల్పై మావోయిస్టు పార్టీ చర్యలు

<<15966343>>‘అభయ్’<<>> పేరుతో కేంద్రంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చిన మల్లోజుల వేణుగోపాల్ను మావోయిస్టు కేంద్ర కమిటీ ‘ద్రోహి’గా పేర్కొంది. తన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేదంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ తమ్ముడే వేణుగోపాల్. కిషన్జీ భార్య సుజాతక్క ఇటీవల పోలీసులకు <<17695477>>లొంగిపోయిన<<>> విషయం తెలిసిందే.
News September 23, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,260 పెరిగి రూ.1,14,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1,150 ఎగబాకి రూ.1,04,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,49,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 23, 2025
గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ.. ఈ మంత్రం పఠించండి

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. ‘ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః.. యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్| గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీభజే॥’ గాయత్రీ అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం లభిస్తుంది.