News December 10, 2024

ఒకే జిల్లాలో 322 మంది పిల్లల మృతి.. బీజేపీ ఫైర్

image

కర్ణాటక బెళగావి జిల్లాలోని GOVT ఆస్పత్రుల్లో JAN నుంచి 322 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. APR-OCT మధ్య 29 మంది మహిళలు ప్రసవానంతరం చనిపోయారని తెలిపింది. ఈ ఘటనలపై విపక్ష BJP ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక కాంగ్రెస్ మోడల్ అంటే డెత్ ట్రాప్ అని విమర్శించింది. ఆరోగ్య శాఖను కాంగ్రెస్ శ్మశానవాటికగా మార్చిందని, తల్లులు, పిల్లల ప్రాణాలను తీస్తోందని దుయ్యబట్టింది.

Similar News

News September 23, 2025

కోళ్ల దాణా నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News September 23, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో జాబ్‌లు

image

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(<>VSSC<<>>) 17 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 6వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.750. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.vssc.gov.in/

News September 23, 2025

స్థానిక సంస్థలు.. బీసీలకు ఎన్ని స్థానాలంటే?

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవి అమలైతే బీసీలకు 13 జడ్పీ, 237 MPP, జడ్పీటీసీ, 2,421 MPTC, 5,359 పంచాయతీ స్థానాలు దక్కనున్నట్లు సమాచారం. దీనిపై జీవో వచ్చాక మరింత క్లారిటీ రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 2,345 జీపీలు, 90 ZPTC, 95 ఎంపీపీ, 1,011 ఎంపీటీసీ, 6 ZP స్థానాలను బీసీలకు కేటాయించింది.