News December 10, 2024
NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ

ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
Similar News
News March 2, 2026
NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.
News March 2, 2026
పెండింగ్ స్కాలర్షిప్లు, ఉపాధి హామీపై కలెక్టర్ సీరియస్

జిల్లాలో రానున్న కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News March 2, 2026
మార్చి 31లోగా లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా LRS దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మార్చి 31 లోగా నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.


