News December 10, 2024
విశాఖలో యువకుడి ప్రాణం తీసిన రూ.2 వేలు

లోన్యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) ఓ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్లో ఉంది. అది కట్టలేదని అతడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. 40 రోజుల క్రితమే పెళ్లి అయిన తన భార్యకు సైతం వాటిని పంపారు. మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

మార్చి 21న ప్రభుత్వం రంజాన్గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.
News March 20, 2026
ఈరోజు స్కూళ్లు యధాతథం: విశాఖ డీఈవో

రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News March 20, 2026
వైజాగ్ బే సిటీకి గ్లోబల్ బిడ్స్ ఆహ్వానం

VMRDA ప్రతిష్ఠాత్మక ‘వైజాగ్ బే సిటీ’ ప్రాజెక్టును గ్లోబల్ కన్సల్టెంట్ ఎంపికకు బిడ్స్ ఆహ్వానించింది. కైలాసగిరి-భీమిలి వరకు తీరాన్ని అంతర్జాతీయ స్థాయి వాటర్ఫ్రంట్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టుకు 2026-ఏప్రిల్ 2 లోపు ప్రతిపాదనలు సమర్పించాలి. పర్యాటకం, వ్యాపారం, ప్రీమియం నివాసాలపై దృష్టి సారించి బ్లూ ఫ్లాగ్ బీచ్లు, థీమ్ పార్కులు, కార్పొరేట్ హబ్లు ఏర్పాటు చేయనున్నారు.


