News December 10, 2024

GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

image

AP: డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని త్వరలోనే లబ్ధిదారులకు ‘క్రిస్మస్ కానుక’ అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తాం’ అని మంత్రి ప్రకటించారు.

Similar News

News September 22, 2025

నవరాత్రి ఉత్సవాలు షురూ..

image

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.

News September 22, 2025

ఎల్లుండి విజయవాడకు సీపీ రాధాకృష్ణన్

image

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్‌లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్‌కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.

News September 22, 2025

INDvsPAK.. మూడోసారి తలపడే అవకాశం?

image

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్‌ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.