News December 10, 2024
మనోజ్.. నిన్ను కనడమే నేను చేసిన పాపమా?: మోహన్ బాబు

TG: మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.
Similar News
News October 22, 2025
RARE PHOTO: ఆకాశంలో అద్భుతం

అత్యంత అరుదుగా కనిపించే రెడ్ స్ప్రైట్స్(ఎర్రటి మెరుపులు) న్యూజిలాండ్లో ఆవిష్కృతమయ్యాయి. NZ ఫొటోగ్రాఫర్ టామ్ రే, స్పానిష్ ఫొటోగ్రాఫర్స్ జఫ్రా, జోస్ సౌత్ ఐలాండ్లో మిల్కీ వే చిత్రాలు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఊహించని దృశ్యాన్ని కెమెరాలో బంధించారు. తుఫానుల సమయంలో ఆకాశంలో ఏర్పడే ఈ రెడ్ స్ప్రైట్స్ 90KM ఎత్తు వరకు వెళ్తాయి. రెప్పపాటులో కనుమరుగయ్యే ఈ మెరుపులను చిత్రీకరించడం ఎంతో కష్టం.
News October 22, 2025
థాంక్స్ చెబుతూనే మోదీ చురకలు!

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పీఎం మోదీ <<18069464>>థాంక్స్ చెప్పిన <<>>విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధన్యవాదాలు చెబుతూనే ట్రంప్కు చురకలు అంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఐక్యంగా వ్యతిరేకించాలంటూ ప్రధాని హితవుపలికారు. పాక్ను ట్రంప్ సపోర్ట్ చేస్తుండటాన్ని పరోక్షంగా గుర్తు చేశారని, ఇదే సమయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.