News December 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ శంకరపట్నం మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ. @ ఇబ్రహీంపట్నం మండలంలో హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు. @ కథలాపూర్ మండలంలో జెడ్పి ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి రాము. @ ఈ నెల 15లోగా సీఎంఆర్ అందించాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ చందుర్తి మండలంలో ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్. @ వేములవాడ రాజన్నా ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల మెట్పల్లిలో నిరసన.

Similar News

News September 15, 2025

కరీంనగర్ కలెక్టరేట్ భవనం భద్రమేనా?

image

KNR కలెక్టరేట్‌ను 1982లో కట్టారు. సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. ప్రధాన విభాగాలన్నీ పాత భవనంలోనే కొనసాగుతుండటం, నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నా ముందుకు సాగకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయాలను నూతన భవనంలోకి మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ కలెక్టరేట్ కూలిన ఘటనతో కరీంనగర్ కలెక్టరేట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

News September 15, 2025

కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

image

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయింది.

News September 14, 2025

కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

image

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.