News December 11, 2024

‘ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ఖమ్మం: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ పాస్ వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ అన్నారు. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారికి న్యూ స్కీం క్రింద బాలురకు సం.కి రూ.1,000, బాలికలకు సం.కి రూ.1,500, రాజీవ్ విద్య దీవెన క్రింద 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు సం.కి రూ.3 వేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

KMM: డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

image

ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సోమ, మంగళవారాల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలకు రావాలని సూచించారు. అడ్మిషన్ల వివరాలను ఈనెల 17న ‘దోస్త్’ పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఈ చివరి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 14, 2025

ఖమ్మం జిల్లాలో దడ పుట్టిస్తోన్న డెంగీ..!

image

ఖమ్మం జిల్లాలో కొద్దిరోజులుగా డెంగీ దడ పుట్టిస్తోంది. రోజురోజుకూ జ్వర బాధితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఇప్పటి వరకు 171 కేసులు నమోదయ్యాయి. 111డెంగీ ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సమావేశాల్లో ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహకులు దండుకుంటున్నారు.

News September 14, 2025

ఖమ్మంలో లోక్ అదాలత్.. 597 కేసులు పరిష్కారం

image

ఖమ్మం జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆయన చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 4,746 కేసులను గుర్తించగా, వాటిలో 597 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల గొడవలు, ఆస్తి వివాదాలు, బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు