News December 11, 2024

గజగజ.. మళ్లీ పెరిగిన చలి

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గతనెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. TGలోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గిపోయింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Similar News

News November 1, 2025

APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

image

ముంబై పోర్ట్ అథారిటీ 116 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/

News November 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 53

image

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ఎవరు?
2. తారకాసురుని సంహరించింది ఎవరు?
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు?
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి పేరు?
5. పంచభూత స్థలాల్లో భూమి(పృథ్వీ) లింగం ఎక్కడ ఉంది?
☛ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
Ithihasaluquiz

News November 1, 2025

కర్నూలు ప్రమాదం: దుష్ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు

image

AP: కర్నూలు బస్సు దుర్ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ 27 మందిపై కేసు నమోదైంది. ఇందులో YCP అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి, కందూరి గోపీకృష్ణ, YCP ట్విటర్ నిర్వాహకులు ఉన్నారు. కర్నూలు రూరల్(M) తాండ్రపాడుకు చెందిన వేణుములయ్య ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్టుషాపులే <<18120317>>కారణమని<<>> ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు పెట్టారని అందులో పేర్కొన్నారు.