News December 11, 2024
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. CM చంద్రబాబు అధ్యక్షత వహించనున్న ఈ సదస్సులో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న రోజుల్లో అందించే పాలన, తదితరాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు ఉదయం 10.30గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.30 వరకు కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓసారి సదస్సు నిర్వహించగా, ఇది రెండోది.
Similar News
News January 24, 2026
రథ సప్తమి పూజ ఎందుకు చేయాలి?

సూర్యుడు జన్మించిన రోజు కాబట్టి దీన్ని ‘సూర్య జయంతి’గా జరుపుకొంటారు. సూర్యరశ్మి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, చర్మ వ్యాధులు, కంటి సమస్యల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేస్తారు. రథసప్తమి రోజున ఆచరించే అరుణోదయ స్నానం, సూర్యారాధన వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి, సకల కార్యసిద్ధి కోసం భక్తులు ఈ పర్వదినాన్ని అత్యంత నిష్టతో జరుపుకొంటారు.
News January 24, 2026
పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను దుక్కి పద్ధతిలో రైతులు విత్తుకుంటారు. అయితే పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.
News January 24, 2026
కీలక మీటింగ్కు గైర్హాజరు.. స్పందించిన శశి థరూర్

కాంగ్రెస్ కీలక సమావేశానికి గైర్హాజరుపై వస్తున్న వార్తలను ఆ పార్టీ MP శశి థరూర్ తోసిపుచ్చారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికలపై చర్చించబోనన్నారు. ‘రాజకీయ ప్రకటనలు చేయడానికి రాలేదు. సొంత పార్టీ నాయకులతో చర్చించాల్సిన సమస్యలపై పబ్లిక్లో మాట్లాడను. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను’ అని కేరళ సాహిత్య ఉత్సవంలో చెప్పారు.


