News December 11, 2024
గంటలో న్యూయార్క్ నుంచి లండన్కు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733887417459_1032-normal-WIFI.webp)
అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఇంగ్లండ్లోని లండన్కు గంటలో ప్రయాణించేలా ట్రైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 3,400 మైళ్ల దూరం ప్రస్తుతం విమానంలో వెళ్లాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతుంది. అట్లాంటిక్ మహా సముద్రంలో ట్రాన్స్ అట్లాంటిక్ టన్నెల్ ద్వారా రైలులో 54 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సుమారు 19.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీనిని నిర్మించేందుకు దశాబ్దాలు పట్టొచ్చు.
Similar News
News December 27, 2024
తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735238498615_695-normal-WIFI.webp)
తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.
News December 27, 2024
మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(1/2)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735240333158_695-normal-WIFI.webp)
1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ జట్టుకట్టారు. లిబరలైజేషన్(వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ(ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు.
News December 27, 2024
మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(2/2)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735240410778_695-normal-WIFI.webp)
1991లో ఎగుమతులను ప్రోత్సహించడానికి పరిమితులను కుదించారు. రూపాయి విలువను తగ్గించి విదేశీ మార్కెట్లో IND ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే లైసెన్స్ రాజ్ను రద్దు చేశారు. కార్పొరేట్ పన్నులను పెంచారు. వంటగ్యాస్, చక్కెరపై సబ్సిడీలు తగ్గించారు. IMF సాయం పొందటం బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎగుమతి-దిగుమతి నిబంధనలను సరళీకరించారు. ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.