News December 11, 2024

బాధ్యతలు స్వీకరించిన RBI కొత్త గవర్నర్

image

IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్‌టైమ్ జనరల్‌’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.

Similar News

News September 19, 2025

శాసనమండలి వాయిదా

image

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.

News September 19, 2025

ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.

News September 19, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,11,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.150 ఎగబాకి రూ.1,02,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,43,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.