News December 12, 2024
నిఖేశ్ అక్రమార్జన రోజుకు రూ.2 లక్షలు!

TG: నీటిపారుదలశాఖ AEE నిఖేశ్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అక్రమార్జన రోజుకు ₹.2లక్షలకు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్లో చేరిన 10ఏళ్లలోనే ₹.100కోట్లు కూడబెట్టారని సమాచారం. ఒక్కో ఫైల్కే ఆయన ₹.50లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. FTL, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 9, 2025
పాలలో వెన్నశాతం పెరగాలంటే?(2/2)

పశువులకు కొత్త మేతను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ వెళ్లాలి. దాణా మేపడానికి 2-3గంటల ముందుగా పచ్చి, ఎండు గడ్డిని ఇవ్వడం ఉత్తమం. పశువుల నుంచి 6-7 నిమిషాల్లో పాలను పిండుకోవాలి. నెమ్మదిగా పిండితే కొవ్వు శాతం తగ్గుతుంది. పాలు పితికేటప్పుడు పశువును కొట్టడం, అరవడం లాంటివి చేయకూడదు. పశువులను మేత కోసం ఎక్కువ దూరం నడిపించకూడదు. వ్యాధులకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి.
News November 9, 2025
నష్టపరిహారం హెక్టారుకు రూ.25,000: అచ్చెన్న

AP: తుఫాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు ₹17వేల నుంచి ₹25వేలకు పెంచుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరటి పంటలకు అదనంగా ₹10వేలు కలిపి అందించనున్నట్లు వెల్లడించారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు ₹1,500 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టంపై ఈ నెల 11 నాటికి 100% అంచనాలు సిద్ధమవుతాయన్నారు. రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు.
News November 9, 2025
డెలివరీ తర్వాత నడుంనొప్పి వస్తోందా?

కాన్పు తర్వాత చాలా మంది మహిళల్లో వెన్నునొప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్మోన్లలో మార్పులు, వెయిట్ పెరగడం వల్ల నడుంనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని తగ్గించుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి. కూర్చొనే పొజిషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సపోర్టింగ్ బెల్టులు, హీటింగ్ ప్యాడ్, ఐస్ ప్యాక్ వాడటం వల్ల నడుంనొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే ఏవైనా బరువులెత్తేటపుడు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


