News December 12, 2024
సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Similar News
News January 20, 2026
నెల్లూరులో దొంగ నాగ సాధువులు హల్చల్

నాగ సాధువుల ముసుగులో ఓ ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో హల్చల్ చేశారు. ఓ ఇంటికి వెళ్లి అన్నం పెట్టమని అడిగారు. వారు లేదని చెప్పడంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు వారిపై దాడికి ప్రయత్నించారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాగసాధువు ముసుగులో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బూతులు మాట్లాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
News January 20, 2026
నెల్లూరు: తల్లులకు తప్పని నిరీక్షణ.!

ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం నీరుగారుతోంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 24,459 మంది గర్భిణీలు నమోదవ్వగా 12,353 మందికి ఆర్థిక సాయం అందింది. 12,106 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 10,656 మంది దరఖాస్తులు వివిధ సమస్యలతో రిజెక్ట్ అయ్యాయి. మొదటి కాన్పుకు ₹5 వేలును రెండు విడతల చొప్పున ఇవ్వాలి. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఒకే విడతలో ₹6వేలు తల్లి ఖాతాకు జామ చేస్తారు.
News January 20, 2026
నెల్లూరు: 12 ఏళ్లలో పల్లె నుంచి పారిశ్రామిక హబ్ దాకా.!

గత 12 ఏళ్లలో ముత్తుకూరు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 2014లో కేవలం చేపల వేట, రొయ్యల సాగుకే పరిమితమైన ఈ తీర ప్రాంతం, 2026 నాటికి ఏపీలోనే కీలక ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. అదానీ పోర్ట్ విస్తరణ, భారీ థర్మల్ ప్లాంట్లు, 4-లేన్ రోడ్లతో నేడు గ్లోబల్ మ్యాప్లోకి ఎక్కింది. నాడు వలసలకు నిలయమైన ముత్తుకూరు, నేడు వేలాది మందికి స్థానికంగానే ఉపాధి కల్పిస్తూ, రియల్ ఎస్టేట్లో రికార్డులు సృష్టిస్తోంది.


