News December 13, 2024
భువనగిరి ఒక్కటే మిగిలింది!

త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ ఉన్నారు. ఈ లెక్కన నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి మంత్రి పదవి లభించినట్లైంది. ఇక భువనగిరి జిల్లా మాత్రమే మిగిలుండగా బెర్తు దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Similar News
News January 14, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

నల్గొండ ఇక కార్పొరేషన్… గెజిట్ విడుదల
మాడుగులపల్లి: చైనా మాంజా నుంచి సేఫ్.. ఐడియా అదిరింది
నల్గొండ: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
నల్గొండ: భోగి మంటల్లో జీవో ప్రతులు దగ్ధం
కట్టంగూరు: పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు
మిర్యాలగూడ: జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి
కట్టంగూరు: ఘనంగా గోదారంగనాథ స్వామి కళ్యాణం
దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన
News January 14, 2026
NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 14, 2026
నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.


