News December 13, 2024

వనపర్తి: కొడుకు మందలించాడని తల్లి సూసైడ్‌‌

image

కొడుకు మందలించాడన్న మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న వనపర్తి జిల్లాలో జరిగింది. SI సురేశ్‌‌ గౌడ్‌‌ తెలిపిన వివరాలు.. ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటకు చెందిన కాశమ్మ(68) తరచుగా కల్లు తాగుతుండడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈదే విషయంలో గురువారం మరోసారి గొడవ పడగా కాశమ్మ ఇంట్లోంచి వెళ్లిపోగా గ్రామ శివారులోని చెరువులో డెడ్‌‌బాడీ దొరికింది.ఆమె కొడుకు శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News September 14, 2025

GREAT: 97 సైబర్ కేసులు.. రూ.32,19,769 రిఫండ్

image

MBNRలోని నమోదైన సైబర్ క్రైమ్ కేసులను 97 ఛేదించినట్లు సైబర్ క్రైమ్ SI శ్రవణ్ కుమార్ Way2Newsతో తెలిపారు. 97 మంది బాధితులకు సంబంధించి రూ.32,19,769 ఫ్రీజ్ చేయించి రిఫండ్ చేయించామని, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాధితులకు రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేశామన్నారు. బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో SP జానకి, అడిషనల్ ఎస్పీ రత్నం అభినందించారు. సైబర్ నెరగాళ్లతో మోసపోయినట్లు తెలిస్తే గంటలోపు 1930 కాల్ చేయాలన్నారు.

News September 14, 2025

MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడగింపు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 18లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 20 లోపు (ఫైన్ తో) అప్లై చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News September 14, 2025

మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో డీకే అరుణ

image

తిరుప‌తి వేద‌కగా ఆదివారం ప్రారంభ‌మైన తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు కార్యక్రమంలో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంట్ పరిధిలో మహిళా సాధికారత, 10 అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యత, మహిళ 7 ఆత్మగౌరవాన్ని పెంచే దిశలో తీసుకోవాల్సిన చర్యలు, ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై కీలకంగా చర్చించడం జరుగుతుందన్నారు.