News December 14, 2024
కంచె ఐలయ్యపై ఉన్న కేసులు కొట్టివేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734129860166_782-normal-WIFI.webp)
TG: ఫ్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన రాసిన ఓ పుస్తకం తమ మనోభావాలు దెబ్బతీశాయని ఓ సామాజికవర్గానికి చెందిన పలువురి ఫిర్యాదులతో కోరుట్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలంటూ ఐలయ్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసులను కొట్టేశారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కొట్టేసిందని జడ్జి ప్రస్తావించారు.
Similar News
News February 5, 2025
హీరోయిన్ నోరా ఫతేహీ మృతి అంటూ వదంతులు.. క్లారిటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738769954859_367-normal-WIFI.webp)
బంగీ జంప్ ప్రమాదంలో హీరోయిన్ నోరా ఫతేహీ మృతి చెందారంటూ వదంతులు వస్తున్నాయి. బంగీ జంప్ చేస్తుండగా రోప్ తెగి పైనుంచి కిందపడి మరణించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆ వీడియోలో ఉన్నది నోరా కాదని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. గతంలో బంగీ జంప్ చేస్తూ చనిపోయిన మహిళకు బదులు నోరా ఫొటోను ఉపయోగించి ఫేక్ వీడియో సృష్టించారని పేర్కొంది.
News February 5, 2025
బెస్ట్ క్లోజప్ ఫొటోగ్రాఫ్స్ -2025 ఇవే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738739765601_746-normal-WIFI.webp)
క్లోజప్ ఫొటోగ్రాఫ్స్ -2025 విజేతలను ‘ఫోర్బ్స్’ ప్రకటించింది. కీటకాల విభాగంలో స్వెత్లానా(రష్యా) తీసిన మగ స్టాగ్ బీటిల్స్ గొడవ పడుతున్న ఫొటోకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. యువ విభాగంలో 14ఏళ్ల ఆండ్రెస్(స్పెయిన్) తీసిన తేనెటీగలను పక్షి తింటోన్న ఫొటో విజేత. ఇందులోనే జర్మనీకి చెందిన 17ఏళ్ల అలెక్సిస్ తీసిన రాబర్ ఫ్లై మరో కీటకాన్ని తింటోన్న ఫొటోకు సెకండ్ ప్రైజ్. కాగా, పంట తింటోన్న ఎలుక ఫొటో ఆకట్టుకుంటోంది.
News February 5, 2025
ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738764377357_782-normal-WIFI.webp)
AP: ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని NTR వైద్యసేవ CEOను ఆదేశించింది. ఇప్పటి వరకు TGలో 11 ఆస్పత్రుల్లోనే NTR వైద్యసేవ ట్రస్టు సేవలు అందుతున్నాయి. దీంతో 2015 తర్వాత ట్రస్టు గుర్తింపులేని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.