News December 14, 2024
నగరి: విద్యుత్ సిబ్బంది సాహసం.. బోటులో వెళ్లి మరమ్మతులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734142705823_20345978-normal-WIFI.webp)
రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గూళూరు చెరువు పూర్తిగా నీటితో నిండింది. దీంతో వడమాల పేట మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సిబ్బంది నిండుకుండలా మారిన గూళూరు చెరువులోకి బోటులో వెళ్లి లైన్కు మరమ్మతులు చేపట్టారు. ప్రాణాలకు తెగించి వారు చూపిన తెగువను పలువురు అభినందించారు.
Similar News
News December 22, 2024
చిత్తూరు: ఈ లెటర్ మీ ఇంటికి వచ్చిందా.. జాగ్రత్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734846640765_1106-normal-WIFI.webp)
చిత్తూరు జిల్లాలో సైబర్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం మోసాలనే చూశాం. ఇది వాటికి మించినది. సైబర్ నేరగాళ్లు మీ ఇంటి ముందు ఓ ప్రముఖ కొరియర్ ఫాం పడేసి డెలివరి డేట్ మార్చాలనో లేదా అడ్రస్ మార్చాలనో అడుగుతారు. పొరపాటున మీరు ఫాంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేశారో అంతే సంగతులు. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయం. ఇలాంటి వాటిపై తస్మాస్ జాగ్రత్త.
News December 22, 2024
మదనపల్లె: డిగ్రీ పరీక్షల్లో యథేచ్ఛగా మాస్ కాపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734835218065_1106-normal-WIFI.webp)
SVU పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో యథ్చేచ్చగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మదనపల్లెలో కొన్ని కాలేజీలలో యాజమాన్యాలు సీపీ కెమెరాలు ఆఫ్ చేయించి మరీ పరీక్షలు రాయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై SVU పరీక్షల నియంత్రణ అధికారి కిశోర్ను వివరణ కోరగా.. ఈ అంశం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
News December 22, 2024
చిత్తూరు: తండ్రే హత్య చేయించాడు.?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734830502971_1106-normal-WIFI.webp)
పుంగనూరు(M) లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె(M) గుంపులపల్లె సోమశేఖర్రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటుుబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.