News December 14, 2024

అన్ని ప్రజాస్వామ్యాలకు భారత్ తల్లివంటిది: పీఎం మోదీ

image

భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని PM మోదీ పార్లమెంటులో అన్నారు. ‘75 ఏళ్ల ప్రజాస్వామ్య వేడుక చేసుకునే ఆనంద క్షణాలివి. ప్రజాస్వామ్యాలన్నింటికీ భారత్ తల్లివంటిది. రాజ్యాంగ నిర్మాతలతో పాటు ప్రజలకు నా ధన్యవాదాలు. రాజ్యాంగంలో మహిళలది కీలక పాత్ర. వారిని గౌరవిస్తూ మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టాం’ అని పేర్కొన్నారు. త్వరలోనే భారత్ 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని PM ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 5, 2025

నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప-2 హవా

image

థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 సినిమా ఓటీటీలోనూ దుమారం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 4రోజుల్లోనే 5.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 7 దేశాల్లో వ్యూయర్‌షిప్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషేతర కేటగిరీల్లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ రూ.1850 కోట్లపై చిలుకు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

News February 5, 2025

నాటు-నాటు ఫోజులో ‘NTR’ పోస్టర్ షేర్ చేసిన ‘ఫిఫా వరల్డ్ కప్’

image

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు నేమార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే కావడంతో ‘ఫిఫా వరల్డ్’ కప్ ఇంట్రెస్టింగ్‌గా విష్ చేసింది. ఈ ముగ్గురూ ‘RRR’ సినిమాలోని నాటునాటు స్టెప్‌ వేసినట్లు పోస్టర్‌పై NTR అని ఉంచి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR టీమ్ సైతం స్పందిస్తూ వారికి విషెస్ తెలియజేశారు.

News February 5, 2025

రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి

image

AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.

error: Content is protected !!