News December 15, 2024

దాతృత్వంలో శివ్ నాడార్, ముకేశ్ అంబానీలు టాప్

image

సామాజిక అంశాలు, అభివృద్ధి పనుల కోసం దేశంలోని ధనికులు తమవంతుగా విరాళాలిస్తుంటారు. ఈ ఏడాది అత్యధికంగా శివ్ నాడార్ ₹2153 కోట్లు విరాళమిచ్చారు. ₹407 కోట్లు డొనేట్ చేసి ముకేశ్ ఫ్యామిలీ రెండో ప్లేస్‌లో ఉండగా ₹352 కోట్లతో బజాజ్ ఫ్యామిలీ మూడో స్థానంలో నిలిచింది. కుమార మంగళం బిర్లా ₹334 కోట్లు, గౌతమ్ అదానీ ₹330 కోట్లు, నందన్ నిలేకని ₹307 కోట్లు, అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ₹241కోట్లు డొనేట్ చేశాయి.

Similar News

News November 11, 2025

షమీ విషయంలో ఆరోపణలను ఖండించిన BCCI!

image

షమీని కావాలనే సెలక్ట్ చేయట్లేదన్న ఆరోపణలను ఓ BCCI అఫీషియల్ ఖండించినట్లు PTI పేర్కొంది. ‘షమీ ఫిట్‌నెస్‌పై తరచూ వాకబు చేస్తూనే ఉన్నాం. అతణ్ని ఇంగ్లండ్ సిరీస్‌కు పంపేందుకు ప్రయత్నించాం. ఇంగ్లండ్ లయన్స్‌పై భారత్-A తరఫున అతడిని బరిలోకి దింపితే ఫిట్‌నెస్‌పై అంచనా వస్తుందనుకున్నాం. కానీ సిద్ధమయ్యేందుకు షమీ తగిన సమయం కావాలన్నారు. అతణ్ని సంప్రదించలేదన్నది అవాస్తవం’ అని ఆయన చెప్పినట్లు వెల్లడించింది.

News November 11, 2025

వరద బాధిత కుటుంబాలకు ₹12.99 కోట్ల సాయం

image

TG: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా ₹12.99 కోట్లు అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలు, వరదల్లో 15 జిల్లాల్లో 8662 ఇళ్లు దెబ్బతిన్నట్లు కలెక్టర్లు నివేదికలు పంపారు. ఈ ఇళ్ల యజమానులకు ₹15,000 చొప్పున అందించనున్నారు. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అక్టోబర్ 27-30 వరకు వరుసగా 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలతో ఈ నష్టం వాటిల్లింది.

News November 11, 2025

లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

image

నెల్లూరు: NTR నగర్ వద్ద నేషనల్ హైవేపై చేపల లోడుతో వెళ్తున్న కంటెయినర్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్, 3 బైకులు, చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.