News December 15, 2024
అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే: గడ్కరీ

దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే 4 రాష్ట్రాల వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు. ఈ ఏడాది అత్యధికంగా యూపీలో 23,652 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు (18,347), మహారాష్ట్ర (15,366), మధ్యప్రదేశ్ (13,798) ఉన్నాయి. యాక్సిడెంట్లలో ఏటా 1,78,000 మంది చనిపోతున్నారని, వీరిలో 18-34ఏళ్ల వయసున్న వారే 60% మంది అని ఉన్నట్లు తెలిపారు.
Similar News
News November 13, 2025
రేపే ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిజల్ట్ రాబోతోంది. మీరెంతో అభిమానించే Way2News ఉ.8 గంటల నుంచే కౌంటింగ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. వేగంతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్లతో ఫలితాల వివరాలను వెల్లడిస్తుంది.
News November 13, 2025
TG TET షెడ్యూల్ విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News November 13, 2025
పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.


