News December 15, 2024

కూతూరుని వేధిస్తూ తండ్రిని హత్య చేసిన ఉన్మాది

image

ఏలూరులో దారుణ ఘటన జరిగింది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని గొడవ పడుతూ వెంకట రాజు (44) అనే వ్యక్తిని నాని అనే యువకుడు శనివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు కాగా పెద్ద కుమార్తెను నాని తరచూ వేధించేవాడన్నారు. దీంతో వెంకటరాజు పిల్లల్ని తీసుకుని ఉంగుటూరుకి వెళ్లి ఉంటున్నారు. పని మీద  ఏలూరు వచ్చిన వెంకటరాజుతో నాని గొడవపడి హత్య చేశాడు.

Similar News

News December 25, 2025

ఆడుకోమని వదిలిన తండ్రి, కొద్దిసేపటికే విగత జీవిగా కొడుకు

image

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.

News December 25, 2025

ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

image

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 25, 2025

గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

image

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.