News December 15, 2024
నిజామాబాద్: గ్రూప్-2అభ్యర్థులకు కీలక సూచన
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నిజామాబాద్లో 63 పరీక్ష కేంద్రాల్లో 19854, కామారెడ్డిలో 19 కేంద్రాల్లో 8085 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధన అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తారని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News February 1, 2025
ధర్పల్లి: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధన కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాయిలు(52) అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 1, 2025
‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి
ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
News February 1, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి
నిజామాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానల్లో కెమెరామ్యాన్ పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.