News December 15, 2024
వణుకుతున్న ఉమ్మడి మెదక్

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా శివంపేటలో 8.2, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 9.9 డిగ్రీలు నమోదైంది. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలికి తోడు మంచు కమ్మేయడంతో ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.
Similar News
News July 9, 2025
మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.
News July 9, 2025
మెదక్: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు.!

ఓపెన్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. బడి మానేసిన పిల్లలకు ఓపెన్ స్కూల్ వరం అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.telanganaopenschool.org/ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News July 8, 2025
మెదక్: 86 శాతం మందికి పంపిణీ

మెదక్ జిల్లాలో మూడు నెలల కోటాకు సంబంధించి బియ్యం పంపిణీ 86 శాతం మంది రేషన్ దారులు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2,16,716 కార్డుదారులు ఉండగా, 1,86,578 మంది బియ్యం తీసుకున్నారని డీఎస్వో నిత్యానందం తెలిపారు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం జూన్ 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. మళ్లీ సెప్టెంబర్లో పంపిణీ చేయనున్నారు.