News December 15, 2024
అయోధ్యలో అపోలో క్రిటికల్ కేర్: ఉపాసన

అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో అపోలో తరఫున ఉచిత అత్యవసర వైద్య సేవల కేంద్రం ప్రారంభించినట్లు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలిపారు. ‘జాలి, దయలోనే నిజమైన సనాతన ధర్మం ఉంటుందని మా తాత ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాటలే స్ఫూర్తిగా ఉచితంగా అత్యవసర వైద్య సేవల్ని రామమందిరం వద్ద అందిస్తున్నాం. ఇప్పటికే శ్రీశైలం, తిరుమల, కేదార్నాథ్, బద్రీనాథ్ వద్ద ఇవి ఉన్నాయి. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.