News December 16, 2024

ఒంగోలు: బైకుపై లిఫ్ట్ ఇస్తే అంతే..!

image

హైవేపై లిఫ్ట్ ఇవ్వడం ఎంత డేంజరో అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఉలవపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఈనెల 11న బైకుపై వెళ్తుండగా GVR ఫ్యాక్టరీ వద్ద ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ప్లాన్ ప్రకారం కాస్త ముందుకు వెళ్లాక ఊళ్లపాలేనికి చెందిన ప్రశాంత్ ఫ్రెండ్స్ కొల్లా సాయి, పసుపులేటి శ్రీకాంత్.. వెంకటేశ్వర్లును బెదిరించి బైక్ తీసుకుని పారిపోయారు. సింగరాయకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News September 14, 2025

SP దామోదర్‌కు వీడ్కోలు

image

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

News September 14, 2025

బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

image

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

News September 14, 2025

కందుకూరు: కరేడులో టెన్షన్..టెన్షన్..

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు (M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జూలై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.