News December 16, 2024
అప్పులపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: BRS

TG: అప్పులపై అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను ఆర్థికమంత్రి తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై BRS సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రివిలేజ్ మోషన్కు అనుమతించాలని స్పీకర్ను కోరినట్లు KTR తెలిపారు. రాష్ట్ర అప్పు రూ.3.90 లక్షల కోట్లు ఉందని RBI చెబితే ప్రభుత్వం రూ.6.90 లక్షల కోట్లు అని చెబుతోందని ఆయన మండిపడ్డారు.
Similar News
News November 8, 2025
ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు BIG ALERT

దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 వెర్షన్ల(ఫోన్స్, ట్యాబ్లెట్స్)లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. శామ్సంగ్, వన్ప్లస్, షియోమీ, రియల్మీ, మోటోరోలా, వివో, ఒప్పో, గూగుల్ పిక్సల్ ఫోన్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. వెంటనే వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 8, 2025
ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తున్న కీటకం

ఆయిల్ పామ్ సాగులో పరాగసంపర్కం కీలకం. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటలో గాలి ద్వారా సంపర్కం సాధ్యం కాదు. అందుకే జగిత్యాల రైతులు ఆయిల్ పామ్ పంటల్లో పరాగసంపర్కం కోసం ఆఫ్రికన్ వీవిల్ అనే కీటకాన్ని వినియోగిస్తున్నారు. చాలా చిన్నగా ఉండే ఈ కీటకం పరాగ సంపర్కానికి కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడి పెరిగేందుకు సహకరిస్తోంది. దీని వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయని జగిత్యాల రైతులు చెబుతున్నారు.
News November 8, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


