News December 16, 2024

HYD: రేషన్ కార్డుల పంపిణీపై MLC కోదండరాం సూచనలు

image

రేషన్ కార్డుల పంపిణీపై HYDలోని శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు కీలక అంశాలు ప్రస్తావించారు. ‘ఎప్పటిలోగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.. 2014 తర్వాత ఉప ఎన్నికలు జరిగిన చోట్ల మినహా, మిగతా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు.. కొత్త రేషన్ కార్డు జారీ చేయడంలో విధానాలు.. వద్వా కమిటీ సూచనలు.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Similar News

News September 16, 2025

HYD: ఎకరా రూ.101 కోట్లు.. ఇది బేస్ ప్రైజే..!

image

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

News September 16, 2025

నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

image

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.