News December 16, 2024
కోహ్లీ.. లండన్లో సెటిల్ అయ్యే సమయమిదే: కుంబ్లే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734337856012_1226-normal-WIFI.webp)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని ఏ ఒక్కరూ ఎందుకు ప్రశ్నించట్లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఆయన ప్రదర్శన ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. బ్యాగులు ప్యాక్ చేసుకొని లండన్లో సెటిల్ అయ్యేందుకు కోహ్లీకి ఇదే సరైన సమయమని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Similar News
News February 5, 2025
రోహిత్ శర్మ రిటైర్మెంట్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738733427400_1045-normal-WIFI.webp)
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.
News February 5, 2025
WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738711901510_695-normal-WIFI.webp)
సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.
News February 5, 2025
చికెన్ తినడానికి భయపడుతున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738728476397_81-normal-WIFI.webp)
APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.