News December 16, 2024

జర్మనీలో ముందస్తు ఎన్నికలు.. అవిశ్వాస తీర్మానంలో ఓడిన షోల్జ్

image

అవిశ్వాస తీర్మానంలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఓటమి పాల‌య్యారు. దీంతో Feb 23న ఆ దేశంలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ రాజకీయ స్థిరత్వం కోసం షోల్జ్ ఈ ఓట‌మిని స్వయంగా కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. Novలో 3 పార్టీల సంకీర్ణ ప్ర‌భుత్వం కూలడంతో విప‌క్షాల మ‌ద్దతుతోనే ఆయన ప్రభుత్వాన్ని న‌డుపుతున్నారు. దేశ రాజ‌కీయ దిశ‌ను ఇప్పుడు ఓట‌ర్లే నిర్ణ‌యిస్తార‌ని షోల్జ్ పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

F-35B గురించి తెలుసా?

image

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

News July 6, 2025

విజయానికి 5 వికెట్లు

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.

News July 6, 2025

ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

image

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకు‌పైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.