News December 17, 2024

దేశంలోనే తొలి విమానాశ్రయం.. 150 గమ్యస్థానాలకు విమానాలు!

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. 150 గమ్యస్థానాలను కనెక్ట్ చేసిన తొలి భారత ఎయిర్‌పోర్టుగా నిలిచింది. థాయ్ ఎయిర్‌ఏషియా ఎయిర్‌లైన్ ఇటీవల ఢిల్లీ- డాన్ ముయాంగ్ (బ్యాంకాక్) మధ్య విమానాలను ప్రారంభించడంతో ఈ మైలురాయిని సాధించినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది. ఢిల్లీ నుంచి రోజూ 1,400 ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొంది.

Similar News

News September 16, 2025

కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

image

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.

News September 16, 2025

భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

image

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

News September 16, 2025

వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

image

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.