News December 17, 2024

రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీంతో రాష్ట్రంలో 34 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావు హుందాగా ప్రవర్తించడం లేదని దుయ్యబట్టారు. తిరిగి అధికారంలోకి వస్తామని నమ్మకం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు.

Similar News

News December 29, 2025

అదరగొట్టిన హంపి, అర్జున్.. మోదీ, CBN ప్రశంస

image

FIDE వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి అదరగొట్టారు. దోహాలో జరిగిన ఈ టోర్నీలో హంపి మహిళల విభాగంలో, అర్జున్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఇది భారత్‌కు గర్వకారణమని PM మోదీ పేర్కొన్నారు. వారి పట్టుదల, అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ వేదికపై తెలుగు ఆటగాళ్ల ప్రతిభను చంద్రబాబు ప్రశంసించారు.

News December 29, 2025

సీఎం చంద్రబాబు ఫీల్ అవుతున్నారు: అనగాని

image

AP: జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై CM చంద్రబాబు కూడా ఫీల్ అవుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కానీ రాయచోటితో ఉండటానికి ఎవరూ కోరుకోవట్లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో CM ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాతినిధ్య ప్రాంతం ఇలా అవ్వడంపై మంత్రి రామ్‌ప్రసాద్ బాధలోనూ అర్థముందన్నారు. రానున్న రోజుల్లో ఆయన దీన్ని అధిగమించి, సీఎం ఆశీర్వాదంతో రాయచోటిని అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.

News December 29, 2025

భారత ప్రభుత్వానికి లలిత్ మోదీ క్షమాపణ

image

పరారీలో ఉన్న IPL ఫౌండర్ లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల విజయ్ మాల్యాతో కలిసి చేసిన <<18679569>>వీడియో<<>>పై తీవ్ర విమర్శలు రావటంతో స్పందించారు. ‘ఎవరి ఫీలింగ్స్‌నైనా గాయపర్చి ఉంటే క్షమించాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. వాళ్లను భారత్‌కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.