News December 17, 2024
జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే.
Similar News
News February 2, 2026
అత్తింటి వేధింపులు.. ముగ్గురు పసిపిల్లల్ని చంపి..

కర్ణాటకలోని బగల్కోట్లో ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపిన ఓ తల్లి డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటిలోపలి వైపు తాళం వేసి ఉండగా స్థానికుల సాయంతో భర్త డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు అప్పటికే చనిపోగా చావుబతుకుల్లో ఉన్న భార్య(రూప)ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
News February 2, 2026
805 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(C-DAC)805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్లో 105 పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD అర్హత గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cdac.in
News February 2, 2026
INC రెబల్స్కు 24 గంటల గడువు

TG: మున్సి‘పోల్స్’ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు వేసిన నామినేషన్లపై అందిన నివేదికను TPCC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్ పరిశీలించారు. అనేక చోట్ల రెబల్స్ బెడద ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు బరి నుంచి తప్పుకొనేలా చేయాలని మంత్రులు, DCC అధ్యక్షులను ఆదేశించారు. దానిపై మళ్లీ నివేదిక సమర్పించాలని సూచించారు.


