News December 17, 2024
VJA: హైకోర్టులో డిప్యూటీ సీఎంపై పిటిషన్ దాఖలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ను హైకోర్ట్ సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మంగళవారం దాఖలు చేశారు. గతంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయింది. అయితే కూటమి ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో క్రిమినల్ రివిజన్ ఇద్దరు మహిళా వాలంటర్లు పిటిషన్ దాఖలు చేశారు.
Similar News
News July 10, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
☞ గుడివాడ ఫ్లైఓవర్ పనులు వేగవంతం
☞ వీరవల్లి: మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు
☞ మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పీఏసీఎస్లకు త్రిసభ్య కమిటీలు
☞ మచిలీపట్నం: మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ రాజా హెచ్చరికలు
☞ కనకదుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు
News July 9, 2025
వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News July 9, 2025
మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడిలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారు. PGT, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను పాఠశాల పని వేళలలో అందజేయాలని ప్రిన్సిపల్ బేతపూడి రవి కోరారు.