News December 17, 2024

దృష్టి మ‌ర‌ల్చేందుకే జ‌మిలి ఎన్నిక‌లు: ఉద్ధ‌వ్‌

image

దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే కేంద్రం జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తెచ్చింద‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే విమ‌ర్శించారు. జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌ల‌ను అమ‌లు చేసే ముందు దేశంలో పార‌ద‌ర్శ‌క ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు నాగ్‌పూర్‌లో జ‌రుగుతున్న‌ MH అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా CM ఫ‌డణవీస్‌ను ఉద్ధ‌వ్ క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Similar News

News November 10, 2025

NOV 25వరకు SSC పరీక్ష ఫీజు చెల్లింపు గడువు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజును నవంబర్ 13నుంచి 25వరకు చెల్లించవచ్చని SSC బోర్డు డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. లేట్ ఫీ ₹50తో డిసెంబర్ 3వరకు, ₹200తో DEC 10వరకు, ₹500తో DEC 12వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఫీజును https://bse.ap.gov.in లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. బ్యాంక్ చలానా, CFMS చెల్లింపులను ఆమోదించబోమని వివరించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టంచేశారు.

News November 10, 2025

HYDలో అలర్ట్.. విస్తృత తనిఖీలు

image

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, అనుమానాస్పద వాహనాల్లో చెకింగ్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో RPF, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. మరోవైపు CISF దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.

News November 10, 2025

CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

image

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.