News December 18, 2024
చిత్తూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా

చిత్తూరు నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.10 లక్షలు జరిమానా జడ్జి ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జరుగు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Similar News
News September 14, 2025
జిల్లా కలెక్టర్గా తవణంపల్లి వాసి

తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడంతో స్వగ్రామంలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో వారి తల్లితండ్రులు మునెమ్మ, దొరస్వామి రెడ్డి పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు.
News September 14, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.140 నుంచి 167, మాంసం రూ.203 నుంచి 260 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.231 నుంచి 285 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.210 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 14, 2025
పెద్దపంజాణి: 8 మంది అరెస్ట్

పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.