News December 18, 2024
భవానీపట్నం- విశాఖపట్నం ప్యాసింజర్ రైలు గమ్యం కుదింపు

భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల దృష్ట్యా భవానీపట్నం- విశాఖపట్నం ప్రత్యేక రైలు గమ్యాన్ని రాయగడ స్టేషన్ వరకు పరిమితం చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే సీనియర్ డీసీఎం, సందీప్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెం.08503/04, భవానీపట్నం-విశాఖపట్నం- భవానీపట్నం పాసెంజర్ 3.01.2025 నుండి 9.01.2025 వరకు రాయగడ-విశాఖపట్నం స్టేషన్ ల మధ్య రాకపోకలు సాగిస్తుందని తెలియజేసారు.
Similar News
News September 20, 2025
ఏయూలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో MA, Mcom, MSC కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకుడు డి.ఏ.నాయుడు తెలిపారు. ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 26వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ పీజీ సెట్లో ర్యాంక్ సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీజులు, కోర్సులు, తదితర వివరాలను వెబ్సైట్ నుంచి పొందవచ్చు.
News September 20, 2025
విశాఖ: కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

విశాఖలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. పెందుర్తి పోలీసుల వివరాల ప్రకారం.. చెంగల్రావుపేటకు చెందిన బెహరా అబ్బాయి (65) ఇంట్లో క్లీనింగ్ చేస్తుండగా, ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలింది. ఈ ఘటనలో ఆయన చేతులు, శరీరంపై పలుచోట్ల కాలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 20, 2025
25న ఎంవీపీ కాలనీలో తపాలా డాక్ అదాలత్

తపాలా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 25న ఎంవీపీ కాలనీ రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 22వ తేదీ లోపు రీజనల్ కార్యాలయం చిరునామాకు సమర్పించాలని అధికారులు తెలిపారు.