News December 18, 2024

పూసపాటిరేగ: భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తం

image

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కార‌ణంగా వాతావ‌ర‌ణ కేంద్రం జిల్లాకు వ‌చ్చే మూడు రోజుల్లో భారీవ‌ర్షాల హెచ్చ‌రిక‌లు చేసిన నేపథ్యంలో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తం చేశారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో ఇప్ప‌టికే వ‌రి పంట కోత‌లు పూర్తిచేసి కుప్ప‌లుగా వేసిన ధాన్యం నూర్చ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

Similar News

News January 11, 2026

VZM: 63 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(KGBV) మొత్తం 63 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. టైప్-3లో వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్-10, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-12, ANM-7, అటెండెర్-3, హెడ్ కుక్-1, ASST కుక్-2, వాచ్ ఉమెన్-1 ఉండగా.. టైప్-4లో వార్డెన్-4, పార్ట్ టైమ్ టీచర్-7, చౌకిదార్-5, హెడ్ కుక్-3 ASST కుక్-8 ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూలు.

News January 11, 2026

ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

image

గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని మెడకు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

News January 11, 2026

సంక్రాంతి లోపు రైతులకు ధాన్యం డబ్బులు: మంత్రి కొండపల్లి

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేసి, సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను శనివారం ఆదేశించారు. విజయనగరం జిల్లాకు అదనంగా కేటాయించిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సమీప జిల్లాల్లో అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో సమస్యలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.