News December 18, 2024

జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్సుంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.

Similar News

News March 15, 2026

అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

image

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

News March 15, 2026

తమిళనాడు ఎన్నికలు.. ఫ్రంట్ రన్నర్‌గా DMK?

image

<<19389988>>TN ఎన్నికల్లో<<>> AIADMK నేతృత్వంలోని NDA, DMK, TVK పార్టీల మధ్య పోరు నెలకొంది. 234 స్థానాల్లో 2021లో 159సీట్లతో అధికారంలోకి వచ్చిన DMKకు వెల్ఫేర్ స్కీమ్‌లు, ద్రవిడియన్ మోడల్ గవర్నెన్స్‌ బలం. ఇక పళనిస్వామి AIADMKను నడిపిస్తున్నా జయలలిత లేని లోటును పూడ్చుకునే పనిలోనే ఉన్నట్లు విశ్లేషకుల మాట. అటు TVK యూత్, మైనార్టీ ఓట్లను చీల్చే ఛాన్స్ ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా DMKకు కలిసొస్తుందని అంటున్నారు.

News March 15, 2026

ఎన్నికల వే‘ఢీ’.. సమ్మర్‌లో సమరమే!

image

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల <<19389988>>షెడ్యూల్‌తో<<>> వేసవిలో ఎలక్షన్ వే‘ఢీ’ మొదలైంది. అస్సాం మినహా మూడింట(TN, బెంగాల్, కేరళం) BJPయేతర ప్రభుత్వాలే ఉండటంతో సమరం రంజుగా సాగనుంది. ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP చూస్తుండగా మరోసారి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని స్టాలిన్, మమత, విజయన్ పోరాడుతున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్టీల ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ఈసమ్మర్ హాట్‌హాట్‌గా సాగనుంది.