News December 18, 2024
ఉమ్మడి కరీంనగర్కు ఐటీ హంగులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో IT విస్తరించనుంది. మెరుగైన రవాణా సదుపాయాలు, మానవ వనరులు ఉమ్మడిజిల్లాను ఐటీ సెంటర్గా మార్చనున్నాయి. ఇప్పటికే కరీంనగర్లో ఐటీ టవర్ ఉంది. దీని ద్వారా కొన్ని కంపెనీలు సేవలందిస్తున్నాయి. ఈ దిశలోనే మరికొన్ని కంపెనీలు మంథని, కరీంనగర్లోని కొత్తపల్లిలో అడుగుపెట్టనున్నాయి. IT సేవలకు అనువైన నగరంగా GCC నివేదించినట్లు సమాచారం. దీంతో పలు దేశాలకు కరీంనగర్ సేవలందనున్నాయి.
Similar News
News January 9, 2026
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News January 9, 2026
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News January 9, 2026
KNR: ‘యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.


